ముక్తేశ్వర ఆలయాభివృద్ధికి 100 కోట్లు
Sakshi Education
గోదావరి తీరాన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి వెంటనే రూ.100 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని, కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా మే 19న కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు
ఎప్పుడు : మే 19
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు
ఎప్పుడు : మే 19
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
Published date : 20 May 2019 05:13PM