మోదీపై టైమ్స్ మేగజీన్ కథనం
Sakshi Education
ప్రధాని నరేంద్ర మోదీని పశంసిస్తూ టైమ్ మేగజీన్మే 29న ఒక కథనాన్ని ప్రచురించింది.

గత 5 దశాబ్దాల్లో మోదీలా దేశాన్ని ఎవ్వరూ ఏకం చేయలేకపోయారంటూ ఈ కథనంలో పేర్కొంది. లండన్ కేంద్రంగా పనిచేసే ఇండియా ఇన్కార్పొరేషన్ గ్రూప్ అనే మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో, భారత్కు చెందిన మనోజ్ లాద్వా ఈ కథనాన్ని రాశారు. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధానిగా మోదీ అనే ప్రచార కార్యక్రమంలో పరిశోధన, విశ్లేషణ విభాగానికి మనోజ్ నేతృత్వం వహించారు.
ప్రధాని మోదీ భారత విభజన సారథి (ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అంటూ ఆయనను విమర్శిస్తూ 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు టైమ్ మేగజీన్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాన్ని పాకిస్తాన్ మూలాలున్న ఆతీష్ తసీర్ అనే జర్నలిస్టు రాశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కథనం
ఎప్పుడు : మే 29
ఎవరు : టైమ్ మేగజీన్
ప్రధాని మోదీ భారత విభజన సారథి (ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అంటూ ఆయనను విమర్శిస్తూ 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు టైమ్ మేగజీన్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాన్ని పాకిస్తాన్ మూలాలున్న ఆతీష్ తసీర్ అనే జర్నలిస్టు రాశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కథనం
ఎప్పుడు : మే 29
ఎవరు : టైమ్ మేగజీన్
Published date : 30 May 2019 05:27PM