Skip to main content

మహారాష్ట్రలో మావోయిస్టుల దాడి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కుర్ఖేదా ప్రాంతంలోని లెన్ధారీ వద్ద మే 1న పోలీసుల వాహనం లక్ష్యంగా మావోయిస్టులు దాడి చేశారు.
ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీస్ విభాగం క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) యూనిట్‌కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. కూంబింగ్‌కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను మావోలు పేల్చారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

గడ్చిరోలి జిల్లాలోని దాదర్‌పూర్ గ్రామ సమీపంలో 136వ జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 1న అక్కడికి చేరుకున్న మావోలు రోడ్డు నిర్మాణ పనులకు వాడుతున్న 36 వాహనాలకు నిప్పంటించారు. ఈ సమాచారం అందుకున్న క్యూఆర్టీ కమాండోల బృందం కూంబింగ్‌కు బయలుదేరింది. ఈ సమయంలో మావోలు పోలీసుల వాహనంపై దాడి చేశారు. మే 1నే మ‌హారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. 

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మావోయిస్టుల దాడిలో 15 మంది పోలీసులతో పాటు ఓ డ్రైవర్ మృతి
ఎప్పుడు : మే 1
ఎక్కడ : లెన్ధారీ, కుర్ఖేదా, గడ్చిరోలి, మహారాష్ట్ర
Published date : 02 May 2019 05:11PM

Photo Stories