మే 31వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగింపు
Sakshi Education
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 31వ తేదీ వరకూ పొడిగిస్తూ మే 17న ఉత్తర్వులు జారీచేసింది.
ఎన్డీఎంఏ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(ఎన్ఈసీ) చైర్మన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలు జారీచేశారు. విమానాలు, మెట్రో రైళ్ల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని యథాతథంగా కొనసాగించారు. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోవని స్పష్టం చేశారు. ఆతిథ్య సేవలు, షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్లు కూడా మూసి ఉంటాయని పేర్కొన్నారు. నిర్ధిష్టంగా నిషేధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు మినహా మిగిలిన అన్ని కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి సడలింపులు ఇచ్చారు.

Published date : 18 May 2020 08:48PM