Skip to main content

మే 22న పీఎస్‌ఎల్‌వీ సీ46 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మే 22న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ46 ప్రయోగం చేపట్టనుంది.
పీఎస్‌ఎల్‌వీ సీ46 ద్వారా రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రిశాట్-2బి) అనే అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని భూమికి 555 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. 300 కిలోల బరువైన ఈ ఉపగ్రహంలో ఎక్స్‌బాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. రిశాట్ -2బి భూమి మీద జరిగే మార్పులను, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నాణ్యమైన చిత్రాలను తీసి పంపే సామర్థ్యం కలిగి వుంది. సైనిక అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడనుంది.

రిశాట్ ఉపగ్రహాల సిరీస్‌లో రిశాట్-2బి నాలుగవది. ఇప్పటికే రిశాట్-1, రిశాట్-2, స్కాట్‌శాట్-1 అనే మూడు ఉపగ్రహాలు విజయవంతంగా రోదసీలో పనిచేస్తున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మే 22న పీఎస్‌ఎల్‌వీ సీ46 ప్రయోగం
ఎప్పుడు : మే 11
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
ఎక్కడ : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 13 May 2019 05:32PM

Photo Stories