మే 17దాకా లాక్డౌన్ కొనసాగింపు
Sakshi Education
ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించేందుకు దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతున్న దేశవ్యాప్త లాక్డౌన్ను మరో 2 వారాలు కొనసాగించేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

మూడో దశ లాక్డౌన్ పరిమిత స్థాయిలో, పలు మినహాయింపులతో ఉంటుందని మే 1న ప్రకటించింది. మే 4 నుంచి మరో రెండు వారాలపాటు (17 దాకా) దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై, మెట్రో, విమాన, రైల్వే సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు
కరోనా వైరస్ వ్యాప్తి ఆధారంగా దేశవ్యాప్తంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా పేర్కొంటూ మే 1న కేంద్ర ఆరోగ్య శాఖ జాబితా విడుదల చేసింది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న 130 జిల్లాలను రెడ్ జోన్లో, వైరస్ తీవ్రత కొద్దిగా ఉన్న 284 జిల్లాలను ఆరెంజ్ జోన్లో, కేసులేవీ నమోదు కాని 319 జిల్లాలను గ్రీన్జోన్లో చేర్చింది. మే 3 తరువాత వారం పాటు ఈ జాబితా అమల్లో ఉంటుంది. తదనుగుణంగా రాష్ట్రాలు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
Published date : 02 May 2020 07:18PM