Skip to main content

మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా తర్వాత.. మోదీనే..

న్యూఢిల్లీ: మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత లోక్‌సభలో మెజార్టీతో.. రెండోసారి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయనున్న ప్రధానిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు.
మే 23వ తేదీన వెలువడిన 17వ లోక్‌సభ ఫలితాల్లో బీజేపీ 272 మార్కును సునాయాసంగా దాటింది. 2014 ఎన్నికల్లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో విజయం సాధించింది. 1951-52 మొదటి లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ నాలుగింట మూడొంతుల స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 1957, 1962 ఎన్నికల్లోనూ ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. 1951-52 ఎన్నిక ల్లో 489 స్థానాలకు 364 సీట్లు కాంగ్రెస్ సాధించింది. 1962 ఎన్నికల్లో నెహ్రూ 494 లోక్‌సభ సీట్లకు 361 సీట్లతో భారీ మెజారిటీతో అధికారం చేపట్టారు. మోదీ 2014 ఎన్నికల్లో 282 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా తర్వాతలోక్‌సభలో అత్యంత మెజార్టీతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నరేంద్ర మోదీ
ఎప్పుడు: మే 29
ఎవరు: నరేంద్ర మోదీ
ఎక్కడ: భారతదేశం
Published date : 24 May 2019 06:34PM

Photo Stories