కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
Sakshi Education
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వినియోగిస్తూ పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203 పూర్తిగా అక్రమమని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ సహా ఎలాంటి ముందడుగు వేయకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మే 12న నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు
ఎప్పుడు : మే 12
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు: పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203 పూర్తిగా అక్రమమని
Published date : 13 May 2020 09:01PM