Skip to main content

కరోనాతో సుమో రెజ్లర్ షోబుషి ‌మృతి

కరోనా మహమ్మారి కారణంగా జపాన్‌ యువ సుమో రెజ్లర్‌ తనువు చాలించాడు.
Current Affairs
భారీకాయం తో ప్రేక్షకుల్ని అలరించే పురాతన క్రీడ అయిన సుమో రెజ్లింగ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న 28 ఏళ్ల షోబుషి... నెలరోజుల పాటు కరోనాతో పోరాడి మే 13న‌ కన్నుమూశాడు. టోక్యోలోని ‘టకడగవా సుమో స్టేబుల్‌’కు చెందిన షోబుషి వైరస్‌ దాడి కారణంగా శరీరంలోని అవయవాలు పనిచేయడం మానేయడంతో మృత్యువాత పడ్డాడు. 2007లో షోబుషి ప్రొఫెష‌న‌ల్ సుమో పోటీల్లో పాల్గొన్నాడు. కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత‌ను 11వ స్థానంలో నిలిచాడు. జపాన్‌లో పెద్ద సంఖ్యలో సుమో రెజ్లర్లు, మాస్టర్లు కరోనా బారిన ప‌డిన నేప‌థ్యంలో 2020, మే నెల‌లో జరగాల్సిన ‘బాషో’ టోర్నీలు ర‌ద్దయ్యాయి. 2011లో ఫిక్సింగ్‌ ఉదంతం తర్వాత టోర్నీలు రద్దు కావడం ఇదే మొదటిసారి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జపాన్‌ సుమో రెజ్లర్ ‌మృతి
ఎప్పుడు : మే 13
ఎవరు : షోబుషి(28)
ఎందుకు : కరోనా మహమ్మారి కారణంగా
Published date : 14 May 2020 07:36PM

Photo Stories