Skip to main content

కరోనాతో కేంద్రం ప్రభుత్వంపై మరింత రుణ భారం

కేంద్ర ప్రభుత్వ రుణాలపైనా కోవిడ్‌–19 భారం పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మధ్య తన స్థూల మార్కెట్‌ రుణ సమీకరణ అంచనాలను కేంద్ర ప్రభుత్వం మే 8న గణనీయంగా రూ.12 లక్షల కోట్లకు పెంచేసింది.
Current Affairs
నిజానికి తొలి అంచనా రూ.7.8 లక్షల కోట్లు. అంటే రుణ సమీకరణ అంచనా 4.2 లక్షల కోట్లు పెరిగింది. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌–19 ప్రభావం నేపథ్యంలో తగ్గుతుందని భావిస్తున్న తన ఆదాయాన్ని పూడ్చుకునే క్రమంలో రుణ సమీకరణ అంచనాలను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. వారం వారీ రుణ సమీకరణ లక్ష్యాన్ని కూడా రూ.21,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు లక్ష్యాన్ని (ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతం)కూడా ఆర్థికశాఖ పెంచే అవకాశం ఉంది. తన ఆదాయం–వ్యయాలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించుకోడానికి ప్రభుత్వం మార్కెట్‌ రుణాలను ఒక సాధనంగా ఎంచుకునే సంగతి తెలిసిందే. 2019–20లో మార్కెట్‌ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లుగా ఉంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : స్థూల మార్కెట్‌ రుణ సమీకరణ అంచనాలు రూ.12 లక్షల కోట్లకు పెంపు
ఎప్పుడు : మే 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్‌–19 కార‌ణంగా
Published date : 09 May 2020 07:22PM

Photo Stories