కరియప్ప పరేడ్ గ్రౌండ్ ఏ నగరంలో ఉంది?
Sakshi Education
దేశీయంగా అభివృద్ధి చేసిన 10 మీటర్ల పొడవైన షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్(ఎస్ఎస్బీఎస్)ను భారత సైన్యానికి అందజేశారు.
జూలై 2న ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో మొదటి విడతగా 12 ఎస్ఎస్బీఎస్లను సైన్యానికి అందజేశారు. ఎస్ఎస్బీఎస్ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), ఆర్మీ ఇంజనీర్లు సంయుక్తంగా రూపొందించారు. ఎస్ఎస్బీఎస్ ద్వారా చిన్న నదులు, కాలువలను సలుభంగా దాటి వెళ్లడానికి వీలుపడుతుంది. ఈ వంతెనలు.. 70 టన్నుల ట్యాంకులను(యుద్ధ) మోయగలవని అధికారులు వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత సైన్యానికి 10 మీటర్ల పొడవైన షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్(ఎస్ఎస్బీఎస్) అందజేత
ఎప్పుడు : జూలై 2
ఎవరు : డీఆర్డీవో, ఆర్మీ ఇంజనీర్లు
ఎక్కడ : కరియప్ప పరేడ్ గ్రౌండ్, న్యూఢిల్లీ
ఎందుకు : చిన్న నదులు, కాలువలను సలుభంగా దాటి వెళ్లడానికి...
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత సైన్యానికి 10 మీటర్ల పొడవైన షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్(ఎస్ఎస్బీఎస్) అందజేత
ఎప్పుడు : జూలై 2
ఎవరు : డీఆర్డీవో, ఆర్మీ ఇంజనీర్లు
ఎక్కడ : కరియప్ప పరేడ్ గ్రౌండ్, న్యూఢిల్లీ
ఎందుకు : చిన్న నదులు, కాలువలను సలుభంగా దాటి వెళ్లడానికి...
Published date : 03 Jul 2021 06:04PM