క్రికెటర్లు జోయ్సా, గుణవర్ధనేలపై ఐసీసీ సస్పెన్షన్
Sakshi Education
2018 డిసెంబరులో యూఏఈలో జరిగిన టి10 లీగ్లో అవినీతికి పాల్పడినందుకుగాను శ్రీలంక మాజీ క్రికెటర్లు నువాన్ జోయ్సా, అవిష్క గుణవర్ధనేలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెండ్ చేసింది.

జోయ్సాపై నాలుగు, గుణవర్ధనేపై మూడు అభియోగాలు మోపిన ఐసీసీ వీటికి 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనావళిని ఉల్లంఘించినందుకు జోయ్సా ఇప్పటికే సస్పెన్షన్ ఎదుర్కొంటున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంక మాజీ క్రికెటర్లపై ఐసీసీ సస్పెన్షన్
ఎప్పుడు : మే 11
ఎవరు : నువాన్ జోయ్సా, అవిష్క గుణవర్ధనే
ఎందుకు : అవినీతికి పాల్పడినందుకుగాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంక మాజీ క్రికెటర్లపై ఐసీసీ సస్పెన్షన్
ఎప్పుడు : మే 11
ఎవరు : నువాన్ జోయ్సా, అవిష్క గుణవర్ధనే
ఎందుకు : అవినీతికి పాల్పడినందుకుగాను
Published date : 11 May 2019 05:23PM