Skip to main content

క్రికెటర్ రింకూ సింగ్‌పై నిషేధం

అనుమతి లేని టి20 లీగ్‌లో ఆడినందుకు ఉత్తరప్రదేశ్ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సభ్యుడు రింకూ సింగ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మూడు నెలల నిషేధం విధించింది.
భారత ‘ఎ’ జట్టు నుంచి కూడా తప్పించింది. 21 ఏళ్ల రింకూ ఈ నెల ప్రారంభంలో అబుదాబిలో జరిగిన రమదాన్ టి20 టోర్నీలో పాల్గొన్నాడు. నిబంధనల ప్రకారం బీసీసీఐ పరిధిలోని ఏ క్రికెటర్ కూడా సంస్థ అనుమతి లేకుండా విదేశీ టోర్నీల్లో పాల్గొనకూడదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
క్రికెటర్ రింకూ సింగ్‌పై మూడు నెలల నిషేధం
ఎప్పుడు : మే 30
ఎవరు : క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)
ఎందుకు : అనుమతి లేని టి20 లీగ్‌లో ఆడినందుకు
Published date : 31 May 2019 05:04PM

Photo Stories