కొరియాల సరిహద్దుల్లో కాల్పులు
Sakshi Education
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరింత రాజేసే కీలక పరిణామం మే 3న చోటుచేసుకుంది.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉ.కొరియా సైనికులు తమ సరిహద్దు లోపలి గార్డు పోస్టుపైకి రెండు విడతలుగా తుపాకీ కాల్పులు జరపగా, తాము 20 రౌండ్ల వరకు ‘హెచ్చరిక’కాల్పులు జరిపినట్లు దక్షిణకొరియా బలగాల సంయుక్త అధిపతి వెల్లడించారు. ఈ కాల్పుల్లో తమకు ఎటువంటి నష్టం వాటిల్లలేదన్నారు. తమ బలగాలు ఉ.కొరియా సరిహద్దు లోపలి నిర్మానుష్య ప్రాంతంపైకి కాల్పులు జరిపినందున ఆ వైపున కూడా నష్టం వాటిల్లేందుకు అవకాశం లేదన్నారు.
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కిమ్
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంపైనున్న అనుమానాలు తొలగిపోయాయి. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందన్న ఊహాగానాలకు తెరపడింది. మూడు వారాలపాటు బయట ప్రపంచానికి కనిపించకుండా ఉన్న ఆయన సంచోన్లో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మే1న జరిగిన ఈ కార్యక్రమంలో కిమ్తో పాటు ఆయన సోదరి జాంగ్ ఉన్న వీడియో, ఫొటోలను ఉ.కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది.

ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కిమ్
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంపైనున్న అనుమానాలు తొలగిపోయాయి. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందన్న ఊహాగానాలకు తెరపడింది. మూడు వారాలపాటు బయట ప్రపంచానికి కనిపించకుండా ఉన్న ఆయన సంచోన్లో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మే1న జరిగిన ఈ కార్యక్రమంలో కిమ్తో పాటు ఆయన సోదరి జాంగ్ ఉన్న వీడియో, ఫొటోలను ఉ.కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది.
Published date : 04 May 2020 07:37PM