Skip to main content

కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరాయి.
Current Affairs
సముద్రమట్టానికి 88 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద ప్రవహించే గోదావరి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌లోకి చేరింది. మేడిగడ్డ నుంచి పది లిప్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే ఘట్టం ఆవిష్కృతమైంది. త్రిదండి చినజీయర్ స్వామితో కలసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మే 29న మర్కూక్ పంప్‌హౌస్ వద్ద రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. పంప్‌హౌస్ నుంచి రిజర్వాయర్ వద్దకు వచ్చిన సీఎం దంపతులు, చినజీయర్ స్వామి, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు గోదావరి నీటికి స్వాగతం పలికారు.

రైతు వేదికలకు శంకుస్థాపన
కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ దంపతులు ముందుగా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ మండలంలోని కొండపొచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మర్కూక్, ఎర్రవెల్లి గ్రామాల్లోని రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మర్కూక్ పంప్‌హౌస్ వద్ద మోటార్లు ప్రారంభం
ఎప్పుడు : మే 29
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, త్రిదండి చినజీయర్ స్వామి
ఎక్కడ : సిద్దిపేట జిల్లా, తెలంగాణ
ఎందుకు : కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు
Published date : 30 May 2020 06:11PM

Photo Stories