కిసాన్ క్రెడిట్కార్డ్ల ద్వారా రాయితీపై రుణం
Sakshi Education
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్లో భాగంగా రెండో రోజు రూ. 3.16 కోట్ల ప్యాకేజీని మే 14న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో వలస కూలీలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, రైతులకు రాయితీపై రుణ సదుపాయం, వీధి వ్యాపారులకు పెట్టుబడి.. మొదలైనవి ఉన్నాయి.
రైతులకు రూ. 2లక్షల కోట్లు
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ల ద్వారా రూ. 2 లక్షల కోట్లను రాయితీపై రుణంగా అందిస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయంతో దాదాపు 2.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు. పీఎం–కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రాయితీపై రుణాలందించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడ్తామన్నారు. మత్స్యకారులు, పశుసంవర్థక రంగంలోని రైతులు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చన్నారు. మే, జూన్లో రైతులకు రబీ అనంతర, ప్రస్తుత ఖరీఫ్ అవసరాల కోసం నాబార్డ్ ద్వారా గ్రామీణ సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ. 30 వేల కోట్లు అందుబాటులోకి తెస్తామన్నారు.
హౌజింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు
గృహ నిర్మాణరంగానికి ఊతమిచ్చేందుకు రూ. 70 వేల కోట్లను మంత్రి నిర్మలా ప్రకటించారు. రూ. 6–18 లక్షల వార్షిక ఆదాయ వర్గాల వారికి ఇళ్ల కొనుగోలుకు సబ్సీడీ రుణ సదుపాయాన్ని ఏడాది పెంచారు. ప్రభుత్వ నిధులతో నగరాల్లో నిర్మితమైన గృహ సముదాయాల్లో వలస కార్మికులు, పేదలు తక్కువ అద్దెతో ఉపయోగించుకునేలా ‘అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్స్’లను ఏర్పాటు చేస్తామన్నారు.
వీధి వ్యాపారులకు రూ. 5వేల కోట్లు
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు, వారు మళ్లీ తమ వ్యాపారాలను ప్రారంభించుకునేలా ఒక్కొక్కరికి రూ. 10 వేలను పెట్టుబడి రుణంగా అందిస్తామని నిర్మల తెలిపారు. ఈ భారం ప్రభుత్వంపై సుమారు రూ. 5వేల కోట్ల వరకు ఉండొచ్చన్నారు. ముద్ర–శిశు రుణ పథకం కింద రూ. 50 వేల వరకు అప్పు తీసుకున్న చిన్నతరహా వ్యాపారులకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పించాలని కూడా నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి ఈ వడ్డీ రాయితీ 12 నెలల పాటు కొనసాగుతుందన్నారు. దీనితో ప్రభుత్వంపై రూ. 1500 కోట్ల భారం పడుతుందన్నారు.
ఉపాధికి రూ. 6వేల కోట్లు
కాంపా(కంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధుల్లో ఉపాధి అవకాశాల కోసం రూ. 6 వేల కోట్లను కేటాయిస్తున్నామని మంత్రి చెప్పారు. అడవుల విస్తీర్ణం పెంచే దిశగా మొక్కలు నాటేందుకు, అటవీ పరిరక్షణ కార్యక్రమాలకు స్థానికులకు ఉపాధి లభించేలా ఈ నిధులను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చన్నారు.
వన్ నేషన్.. వన్ రేషన్
వలస కూలీలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా అక్కడి రేషన్ షాపుల్లో తమ రేషన్ను పొందేందుకు ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్’ వీలు కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ అంతర్రాష్ట్ర రేషన్ కార్డ్ పోర్టబిలిటీ దేశవ్యాప్తంగా మార్చి 2021 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు.

వలస కూలీలకు రూ. 3500 కోట్లు
స్వస్థలాల్లో లేని వలస కూలీలకు రానున్న రెండు నెలల పాటు నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల ఆహార ధాన్యాలను, కుటుంబానికి 1 కేజీ పప్పు ధాన్యాలను ఉచితంగా అందిస్తామని మంత్రి నిర్మలా తెలిపారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ, లేదా రాష్ట్ర ప్రభుత్వ రేషన్ కార్డు లేని సుమారు 8 కోట్ల మంది వలస కూలీలు ప్రయోజనం పొందనున్నారు. దీనికోసం దాదాపు రూ. 3500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు నిర్మల చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది.
రైతులకు రూ. 2లక్షల కోట్లు
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ల ద్వారా రూ. 2 లక్షల కోట్లను రాయితీపై రుణంగా అందిస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయంతో దాదాపు 2.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు. పీఎం–కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రాయితీపై రుణాలందించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడ్తామన్నారు. మత్స్యకారులు, పశుసంవర్థక రంగంలోని రైతులు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చన్నారు. మే, జూన్లో రైతులకు రబీ అనంతర, ప్రస్తుత ఖరీఫ్ అవసరాల కోసం నాబార్డ్ ద్వారా గ్రామీణ సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ. 30 వేల కోట్లు అందుబాటులోకి తెస్తామన్నారు.
హౌజింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు
గృహ నిర్మాణరంగానికి ఊతమిచ్చేందుకు రూ. 70 వేల కోట్లను మంత్రి నిర్మలా ప్రకటించారు. రూ. 6–18 లక్షల వార్షిక ఆదాయ వర్గాల వారికి ఇళ్ల కొనుగోలుకు సబ్సీడీ రుణ సదుపాయాన్ని ఏడాది పెంచారు. ప్రభుత్వ నిధులతో నగరాల్లో నిర్మితమైన గృహ సముదాయాల్లో వలస కార్మికులు, పేదలు తక్కువ అద్దెతో ఉపయోగించుకునేలా ‘అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్స్’లను ఏర్పాటు చేస్తామన్నారు.
వీధి వ్యాపారులకు రూ. 5వేల కోట్లు
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు, వారు మళ్లీ తమ వ్యాపారాలను ప్రారంభించుకునేలా ఒక్కొక్కరికి రూ. 10 వేలను పెట్టుబడి రుణంగా అందిస్తామని నిర్మల తెలిపారు. ఈ భారం ప్రభుత్వంపై సుమారు రూ. 5వేల కోట్ల వరకు ఉండొచ్చన్నారు. ముద్ర–శిశు రుణ పథకం కింద రూ. 50 వేల వరకు అప్పు తీసుకున్న చిన్నతరహా వ్యాపారులకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పించాలని కూడా నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి ఈ వడ్డీ రాయితీ 12 నెలల పాటు కొనసాగుతుందన్నారు. దీనితో ప్రభుత్వంపై రూ. 1500 కోట్ల భారం పడుతుందన్నారు.
ఉపాధికి రూ. 6వేల కోట్లు
కాంపా(కంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధుల్లో ఉపాధి అవకాశాల కోసం రూ. 6 వేల కోట్లను కేటాయిస్తున్నామని మంత్రి చెప్పారు. అడవుల విస్తీర్ణం పెంచే దిశగా మొక్కలు నాటేందుకు, అటవీ పరిరక్షణ కార్యక్రమాలకు స్థానికులకు ఉపాధి లభించేలా ఈ నిధులను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చన్నారు.
వన్ నేషన్.. వన్ రేషన్
వలస కూలీలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా అక్కడి రేషన్ షాపుల్లో తమ రేషన్ను పొందేందుకు ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్’ వీలు కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ అంతర్రాష్ట్ర రేషన్ కార్డ్ పోర్టబిలిటీ దేశవ్యాప్తంగా మార్చి 2021 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు.
Published date : 15 May 2020 06:35PM