Skip to main content

కేంద్ర క్రీడా శాఖకు బాక్సర్‌ అమిత్ లేఖ

ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత, భారత స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ పంఘాల్‌ జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Current Affairs

ఎంపిక ప్రక్రియను మార్చాలని పేర్కొంటూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజుజుకు మే 15న లేఖ రాశాడు. ప్రస్తుతం అమలవుతోన్న విధానంలో వివక్ష ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. గతంలో రెండు పర్యాయాలు ‘అర్జున’ అవార్డు కోసం అమిత్‌ నామినేట్‌ అయినప్పటికీ డోపింగ్‌ ఆరోపణలతో అతని పేరు తిరస్కరణకు గురైంది. 2012లో చికెన్‌పాక్స్‌ చికిత్సలో భాగంగా తీసుకున్న ఔషధాల కారణంగా అమిత్ డోపింగ్‌లో పట్టుబడి ఏడాదిపాటు నిషేధానికి గురయ్యాడు. డోపింగ్‌ నేపథ్యమున్న క్రీడాకారులు జాతీయ క్రీడా పురస్కారాలకు అనర్హులని కేంద్ర క్రీడా శాఖ గతంలో పేర్కొంది.


లంకలో పర్యటించండి

షెడ్యూల్‌ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌ కోసం తమ దేశంలో పర్యటించాల్సిందిగా బీసీసీఐని శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కోరింది. కరోనా నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన క్రికెట్‌ సిరీస్‌లు, టోర్నీల నిర్వహణపై అనిశ్చితి నెలకొనడంతో లంకకు వచ్చే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐకి తెలిపింది. 2020, జూన్‌–జూలై మధ్య శ్రీలంక పర్యటనలో భారత్‌ 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాల్సి ఉంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కేంద్ర క్రీడా శాఖకు లేఖ
ఎప్పుడు : మే 15
ఎవరు : బాక్సర్‌ అమిత్‌ పంఘాల్
ఎందుకు : జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ
Published date : 16 May 2020 09:53PM

Photo Stories