Skip to main content

ఇండియా ఓపెన్ బాక్సింగ్‌లో ఎనిమిది స్వర్ణాలు

ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు ఎనిమిది విభాగాల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు.
గతంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ మహిళల 51 కేజీల విభాగంలో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అస్సాంలో గువహటిలో మే 24న జరిగిన ఫైనల్లో మేరీకోమ్ 5-0తో భారత్‌కే చెందిన వన్‌లాల్ దువాటిపై గెలిచింది.సరితా దేవి (60 కేజీలు), జమున బోరో (54 కేజీలు), నీరజ (57 కేజీలు) కూడా స్వర్ణాలు సాధించారు. ఫైనల్స్‌లో సరితా దేవి 3-2తో సిమ్రన్‌జిత్ కౌర్ (భారత్)పై, జమున 5-0తో సంధ్యారాణి (భారత్)పై, నీరజ 5-0తో మనీషా (భారత్)పై గెలిచారు.

ఫురుషుల విభాగంలో దీపక్ (49 కేజీలు), అమిత్ (52 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), శివ థాపా (60 కేజీలు) బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఫైనల్స్‌లో అమిత్ 4-1తో సచిన్ సివాచ్ (భారత్)పై, దీపక్ 5-0తో గోవింద్ (భారత్)పై, ఆశిష్ 4-1తో దుర్యోధన్ (భారత్)పై, శివ థాపా 5-0తో మనీశ్ (భారత్)పై విజయం సాధించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో ఎనిమిది స్వర్ణాలు
ఎప్పుడు : మే 24
ఎవరు : భారత్
ఎక్కడ : గువహటి, అస్సాం
Published date : 25 May 2019 06:11PM

Photo Stories