Skip to main content

హిజ్బుల్‌ కమాండర్ రియాజ్‌ నైకూ హతం

ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్రవాది, ఉగ్రసంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్‌ నైకూ (32) చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే మే6న‌ హతమయ్యాడు.
Current Affairs
కశ్మీర్లోని అతడి సొంత గ్రామంలోనే నైకూను మట్టుబెట్టడం గమనార్హం. మే 5 నుంచి సాగిన ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. అందులో ఒకటి దక్షిణ కశ్మీర్‌లోని షార్షవల్లి కాగా, రెండోది అవంతిపొరలోని బీగ్‌ పొర. రెండు చోట్లా ఇద్దరు చొప్పున ఉగ్రవాదులు మరణించారు. అవంతిపొర ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నైకూను మట్టుబెట్టారు.


మొదట్లో లెక్కల టీచర్‌గా..

మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్‌ 6న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్‌ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఉగ్రసంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్ కమాండర్ హతం
ఎప్పుడు : మే 6
ఎవరు : రియాజ్‌ నైకూ (32)
ఎక్కడ : అవంతిపొర ప్రాంతం, జ‌మ్మూ క‌శ్మీర్‌
Published date : 07 May 2020 07:08PM

Photo Stories