హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్రెడ్డి ప్రమాణం
Sakshi Education
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బొల్లంపల్లి విజయ్సేన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
హైకోర్టు మొదటి కోర్టు హాల్లో మే 2న జరిగిన కార్యక్రమంలో ఆయన చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తితో కలిపి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది. మరో పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజయసేన్రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్లో జన్మించారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేసి 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఆయన తండ్రి జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు.

Published date : 04 May 2020 07:39PM