గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై విచారణకు హైపవర్ కమిటీ
Sakshi Education
విశాఖ ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కారణాలను తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి (హై పవర్) కమిటీని నియమించింది.
నీరబ్కుమార్ ప్రసాద్ నేతృత్వం...
అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సభ్యులుగా ఉండే ఈ కమిటీలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ సభ్య కన్వీనరుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై విచారణకు హైపవర్ కమిటీ
ఎప్పుడు : మే 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : విశాఖ ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కారణాలను తేల్చేందుకు

కారణాలను అన్వేషించడంతోపాటు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫార్సులు చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మే 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం కమిటీ నెల రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలి.
నీరబ్కుమార్ ప్రసాద్ నేతృత్వం...
అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సభ్యులుగా ఉండే ఈ కమిటీలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ సభ్య కన్వీనరుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై విచారణకు హైపవర్ కమిటీ
ఎప్పుడు : మే 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : విశాఖ ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కారణాలను తేల్చేందుకు
Published date : 09 May 2020 07:28PM