Skip to main content

గణిత మేథావి శకుంతలాదేవికి గిన్నిస్ సర్టిఫికెట్

అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్‌గా ఖ్యాతి గడించిన భారత గణిత మేథావి శకుంతలాదేవికి దాదాపు 4 దశాబ్దాల తర్వాత గిన్నిస్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది.
Current Affairs
లండన్‌లో జూలై 30న జరిగిన ఒక కార్యక్రమంలో గిన్నిస్ ప్రతినిధులు శకుంతలాదేవి కుమార్తె అనుపమా బెనర్జీకి గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు. 1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంతవేగంగా కేవలం 28 సెకన్లలోనే గుణించిన శకుంతలాదేవి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అయితే, అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు గిన్నిస్ సంస్థ ధ్రువీకరణ పత్రం అందజేయలేదు. ఆమె 2013లో బెంగళూరులో చనిపోయారు.

బయోపిక్...
అరుణ్ మేనన్ దర్శకత్వంలో శకుంతలాదేవి బయోపిక్ రూపొందింది. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించిన ‘శకుంతలాదేవి’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో జూలై 31న విడుదలైంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : గణిత మేథావి శకుంతలాదేవికి గిన్నిస్ సర్టిఫికెట్
ఎప్పుడు : జూలై 30
ఎందుకు : 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంతవేగంగా కేవలం 28 సెకన్లలోనే గుణించి రికార్డు నెలకొల్పినందున
Published date : 01 Aug 2020 11:50AM

Photo Stories