Skip to main content

గజ్వత్ ఉల్ హింద్ గ్రూప్ చీఫ్ జకీర్ ఎన్‌కౌంటర్

ఉగ్రసంస్థ అల్‌కాయితో సంబంధాలున్న గజ్వత్ ఉల్ హింద్ గ్రూప్ చీఫ్ జకీర్ ముసాను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి.
దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో మే 24న తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముసా మృతి చెందారు. తొలుత దాద్‌సారా గ్రామంలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, అదే సమయంలో అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేశ్ కాలియా వెల్లడించారు. ముసా 2013 నుంచి ఉగ్రకార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గజ్వత్ ఉల్ హింద్ గ్రూప్ చీఫ్ ఎన్‌కౌంటర్
ఎప్పుడు : మే 24
ఎవరు : జకీర్ ముసా
ఎక్కడ : పుల్వామా జిల్లా, జమ్మూకశ్మీర్
Published date : 25 May 2019 06:17PM

Photo Stories