Skip to main content

ఎవరెస్టును అధిరోహించిన తెలంగాణ యువకుడు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాకు చెందిన అంగోత్ తుకారాం అనే గిరిజన యువకుడు ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు.
మే 22న 8,845 మీటర్ల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి అక్కడ జాతీయజెండాను ఎగురవేశాడు. నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్‌లో శిక్షణ పొందిన తుకారం 2016 జూన్ 2న మొదటిసారి హిమాచల్‌ప్రదేశ్‌లోని 17,145 అడుగుల నార్భో పర్వతాన్ని అధిరోహించాడు. తర్వాత ఉత్తరాఖండ్‌లో 19,091 అడుగుల రుదుగైరా పర్వతాన్ని, హిమాలయాల్లోని 20,187 అడుగుల స్టాక్‌కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించాడు.

మంచు పర్వతాలు అలవోకగా అధిరోహించినందుకుగాను హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తుకారాం తన పేరు నమోదు చేసుకున్నాడు. 2018 జూలైలో సౌతాఫ్రికాలో 5,895 మీటర్ల కిలిమంజారో మంచు పర్వతాన్ని అధిరోహించాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎవరెస్టును అధిరోహించిన తెలంగాణ యువకుడు
ఎప్పుడు : మే 22
ఎవరు : అంగోత్ తుకారాం
Published date : 27 May 2019 06:03PM

Photo Stories