Skip to main content

ఎవరెస్ట్‌ పర్వతంపైనా 5జీ సిగ్నల్‌

ప్రపంచంలోకెల్లా ఎత్తైన హిమాలయ పర్వతాలపై 5జీ సిగ్నల్‌ లభించనుంది. టిబెట్‌ చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వతం వైపు ఈ సిగ్నల్‌ అందుబాటులో ఉంటుందని చైనా తెలిపింది.
Current Affairs

ప్రస్తుతం 5,800 మీటర్ల వరకు బేస్‌ క్యాంప్‌ లు ఉన్నాయి. 6,500 మీటర్ల వద్ద ఇటీవల నిర్మించిన బేస్‌ స్టేషన్‌ లో పనులు ప్రారంభం కావడంతో శిఖరంపై వరకు 5జీ అందుబాటులోకి వచ్చింది.


చైనాకు పబ్లిక్‌ రిలేషన్‌ ఏజెన్సీగా డబ్ల్యూహెచ్‌వో

కరోనా వైరస్‌ దాటికి ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై విమర్శల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరింత తీవ్రతరం చేశారు. చైనాకు పబ్లిక్‌ రిలేషన్‌ ఏజెన్సీగా డబ్ల్యూహెచ్‌వో వ్యవహరిస్తోందని, అందుకు ఆ సంస్థ సిగ్గుపడాలన్నారు. మే 1న వైట్‌హౌస్‌లో ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌పై ప్రపంచదేశాలను అప్రమత్తం చేయకుండా లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి కారణభూతమైన డబ్ల్యూహెచ్‌ఒని క్షమించకూడదని అన్నారు. అమెరికా ఏడాదికి 50 కోట్ల డాలర్లు ఇస్తే, చైనా వారికి 3.8 కోట్ల డాలర్ల నిధులు ఇస్తోందని అయినప్పటికీ ఆ సంస్థ చైనాకు పీఆర్‌గా వ్యవహరించడం దారుణమని అన్నారు. ఇప్పటికే అమెరికా డబ్ల్యూహెచ్‌వోకి నిధులు నిలిపివేసింది.

చైనాలో జరుగుతున్న పరిశోధనలు

కరోనా వైరస్‌ ఎలా బయటపడిందన్న అంశంపై చైనాలో కూడా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. చైనా వెట్‌ మార్కెట్‌ నుంచే వచ్చిన ఈ వైరస్‌ ఎలా మనుషులకు సంక్రమించిందో జరుగుతున్న పరిశోధనల్లో భాగస్వామ్యం కావడానికి చైనా ప్రభుత్వం తమను ఆహ్వానిస్తుందని ఆశించినట్టు డబ్ల్యూహెచ్‌వో అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఎవరెస్ట్‌ పర్వతంపైనా 5జీ సిగ్నల్‌
ఎప్పుడు : మే 1
ఎవరు : చైనా
Published date : 02 May 2020 07:15PM

Photo Stories