Skip to main content

ఎఫ్‌ఐహెచ్‌ అధ్యక్షుడి పదవీకాలం పొడిగింపు

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) అధ్యక్ష పదవిలో భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు (ఐఓఏ) చీఫ్‌ నరీందర్‌ బత్రా మరో ఏడాది పాటు కొనసాగనున్నారు.
Current Affairsకరోనా కారణంగా న్యూఢిల్లీ వేదికగా 2020, అక్టోబర్‌ 28న జరగాల్సిన ఎఫ్‌ఐహెచ్‌ వార్షిక సమావేశం 2021 ఏడాది మే నెలకు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసకున్నట్లు ఎఫ్‌ఐహెచ్ మే 9న ప్రకటించింది. ‘ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష పదవితో పాటు మిగిలిన అధికారుల పదవులను కూడా మరో ఏడాది పాటు పొడిగిస్తున్నాం’ అని ఎఫ్‌ఐహెచ్ ప్రక‌టించింది. నిజానికి ప్రస్తుతం ఉన్న కార్యవర్గం పదవీకాలం 2020, ఏడాది అక్టోబర్‌తో ముగియాల్సింది. బత్రా 2016 నవంబర్‌లో ఎఫ్‌ఐహెచ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా బత్రాకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)లో కూడా సభ్యత్వం ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎఫ్‌ఐహెచ్‌ అధ్యక్షుడు నరీందర్‌ బత్రా పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు :  మే 9
ఎవరు : అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌)
ఎందుకు : 2020, అక్టోబర్‌ 28న జరగాల్సిన ఎఫ్‌ఐహెచ్‌ వార్షిక సమావేశం 2021 ఏడాది మే నెలకు వాయిదా పడటంతో
Published date : 11 May 2020 06:06PM

Photo Stories