ఏపీలో వ్యవసాయ రంగంపై మేధోమథన సదస్సు
Sakshi Education
‘మన పాలన- మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా మే 26న రెండో రోజు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేధోమథన సదస్సు నిర్వహించింది.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. రైతులు, రైతు సంఘాల నేతలు, శాస్త్రవేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. సదస్సులో సీఎం మాట్లాడుతూ.. రైతులు, రైతు కూలీల చిరునవ్వే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
అర్చకులకు రూ.5వేల ఆర్థిక సాయం
కోవిడ్-19 విపత్తు సమయంలో ఇబ్బందులు పడుతున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మే 26న కంప్యూటర్ బటన్ నొక్కి వారివారి ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నగదు జమ చేశారు. దీని ద్వారా 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్లు, మౌజన్లకు రూ.37.71 కోట్ల మేర లబ్ధి చేకూరింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యవసాయం, అనుబంధ రంగాలపై మేధోమథన సదస్సు
ఎప్పుడు : మే 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఎక్కడ : తాడేపల్లి క్యాంప్ కార్యాలయం, గుంటూరు జిల్లా
ఎందుకు : మన పాలన- మీ సూచన కార్యక్రమంలో భాగంగా

అర్చకులకు రూ.5వేల ఆర్థిక సాయం
కోవిడ్-19 విపత్తు సమయంలో ఇబ్బందులు పడుతున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మే 26న కంప్యూటర్ బటన్ నొక్కి వారివారి ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నగదు జమ చేశారు. దీని ద్వారా 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్లు, మౌజన్లకు రూ.37.71 కోట్ల మేర లబ్ధి చేకూరింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యవసాయం, అనుబంధ రంగాలపై మేధోమథన సదస్సు
ఎప్పుడు : మే 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఎక్కడ : తాడేపల్లి క్యాంప్ కార్యాలయం, గుంటూరు జిల్లా
ఎందుకు : మన పాలన- మీ సూచన కార్యక్రమంలో భాగంగా
Published date : 27 May 2020 05:54PM