ఏపీలో మరో రూ.400 కోట్ల పెట్టుబడి: కియా
Sakshi Education
ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియా’ ప్రకటించింది.

రాష్ట్రంలో మరో 54 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.400 కోట్లకుపైగా) అదనంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూక్ హ్యూన్ షిమ్ వెల్లడించారు. కియా ఎస్యూవీ వాహనాల తయారీ కోసం ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ‘మన పాలన- మీ సూచన’లో భాగంగా మే 28న పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన మేధోమథన సదస్సులో పాల్గొన్న షిమ్ ఈమేరకు ప్రకటన చేశారు.
పారిశ్రామిక రంగంపై జరిగిన సదస్సులో సీఎం మాట్లాడుతూ.. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి భూమి, నీరు, విద్యుత్తు లాంటి మౌలిక వసతులతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మరో రూ.400 కోట్లకుపైగా పెట్టుబడిపెడతాం
ఎప్పుడు : మే 28
ఎవరు : కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూక్ హ్యూన్ షిమ్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
పారిశ్రామిక రంగంపై జరిగిన సదస్సులో సీఎం మాట్లాడుతూ.. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి భూమి, నీరు, విద్యుత్తు లాంటి మౌలిక వసతులతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మరో రూ.400 కోట్లకుపైగా పెట్టుబడిపెడతాం
ఎప్పుడు : మే 28
ఎవరు : కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూక్ హ్యూన్ షిమ్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 29 May 2020 05:25PM