ఏపీ సీఎంఓ అదనపు కార్యదర్శిగా ధనుంజయరెడ్డి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి నియమితులయ్యారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మే 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ధనుంజయరెడ్డి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్గా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అదనపు కమిషనర్గా ధనుంజయరెడ్డి పనిచేశారు. అనంతరం రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈఓ)గా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖల డెరైక్టర్గా, శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ సీఎంఓ అదనపు కార్యదర్శి నియామకం
ఎప్పుడు : మే 30
ఎవరు : కె.ధనుంజయరెడ్డి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ సీఎంఓ అదనపు కార్యదర్శి నియామకం
ఎప్పుడు : మే 30
ఎవరు : కె.ధనుంజయరెడ్డి
Published date : 31 May 2019 04:59PM