Skip to main content

ఏపీ సీఎం సలహాదారుగా అజేయ కల్లం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం మూడేళ్ల కాలానికి కేబినెట్ హోదాతో జూన్ 4న నియమితులయ్యారు.
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎం పేషీ) అధిపతిగా ఆయన వ్యవహరించనున్నారు. సీఎంవో కార్యదర్శులకు శాఖలను కేటాయించే బాధ్యతను కూడా ప్రభుత్వం కల్లంకు అప్పగించింది. కల్లం గతంలో తిరుమల - తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఛైర్మన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు నియామకం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం
Published date : 05 Jun 2019 05:43PM

Photo Stories