Skip to main content

ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వ అంశం లేదు

కజకిస్థాన్ రాజధాని నూర్-సుల్తాన్(ఆస్థానా) జూన్ 20, 21 తేదీల్లో జరిగే అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ) సమావేశం అజెండాలో భారత్‌కు సభ్యత్వాన్ని ఇచ్చే అంశం లేదని చైనా స్పష్టం చేసింది.
2016 మేలో ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కోసం భారత్ దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి చైనా అడ్డుపడుతోంది. ఎన్‌పీటీపై సంతకం చేసిన వారికే సభ్యత్వం ఇవ్వాలని వాదిస్తోంది. ఎన్‌పీటీపై భారత్, పాకిస్థాన్ సంతకాలు చేయలేదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎన్‌ఎస్‌జీ సమావేశం అజెండాలో భారత్‌కు సభ్యత్వాన్ని ఇచ్చే అంశం లేదు
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : చైనా
ఎక్కడ : నూర్-సుల్తాన్, కజకిస్థాన్
Published date : 22 Jun 2019 05:46PM

Photo Stories