ఏఎన్యూకి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు
Sakshi Education
లండన్ ప్రధాన కేంద్రంగా ఉన్న క్యూఎస్ (క్వాకరెల్లి సైమండ్స) ఐ గేజ్ ఇచ్చే ర్యాంకిం గ్స్ లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్యూ)కి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు లభించింది.
ఈ విషయాన్ని ఏఎన్యూ ఆన్లైన్ ర్యాంకింగ్స కోఆర్డినేటర్ డాక్టర్ భవనం నాగ కిషోర్ మే 28న తెలిపారు. కరోనా వైరస్ లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ తరగతుల నిర్వహణ, యూనివర్సిటీలో ఆన్లైన్ పరిజ్ఞానం వినియోగం అంశాలను ప్రాతిపదికగా క్యూఎస్ తాజా ర్యాంకులను ప్రకటించింది.
యూఎస్ ప్రెసిడెంట్ స్కాలర్
ప్రతిష్టాత్మక యూఎస్ ప్రెసిడెన్షియల్ స్కాలర్-2020 పురస్కారాన్ని అనంతపురం జిల్లాకు చెందిన పి.సంజనరెడ్డి దక్కించుకుంది. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం నుంచి అమ్మాయిల కోటాలో ఆమె ఈ పురస్కారాన్ని సాధించారు. విద్య, ఆర్ట్స, టెక్నాలజీలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దీనిని అందిస్తారు. చియ్యేడు గ్రామానికి చెందిన పెద్దగొర్ల లక్ష్మీరెడ్డి, సమత దంపతులు పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. లక్ష్మీరెడ్డి విస్కాన్సిన్ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వారి కుమార్తె సంజన బ్రూక్ఫీల్డ్ ఈస్ట్ ఉన్నత పాఠశాలలో ప్లస్టూ చదువుతోంది.

యూఎస్ ప్రెసిడెంట్ స్కాలర్
ప్రతిష్టాత్మక యూఎస్ ప్రెసిడెన్షియల్ స్కాలర్-2020 పురస్కారాన్ని అనంతపురం జిల్లాకు చెందిన పి.సంజనరెడ్డి దక్కించుకుంది. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం నుంచి అమ్మాయిల కోటాలో ఆమె ఈ పురస్కారాన్ని సాధించారు. విద్య, ఆర్ట్స, టెక్నాలజీలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దీనిని అందిస్తారు. చియ్యేడు గ్రామానికి చెందిన పెద్దగొర్ల లక్ష్మీరెడ్డి, సమత దంపతులు పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. లక్ష్మీరెడ్డి విస్కాన్సిన్ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వారి కుమార్తె సంజన బ్రూక్ఫీల్డ్ ఈస్ట్ ఉన్నత పాఠశాలలో ప్లస్టూ చదువుతోంది.
Published date : 29 May 2020 05:26PM