ఢిల్లీలో మహిళలకు ఉచిత ప్రయాణం
Sakshi Education
దేశ రాజధాని డిటీసీ, క్లస్టర్ బస్సులు, ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 3న ప్రకటించారు.

మహిళల ప్రయాణ ఖర్చుల్ని ప్రభుత్వం భరిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిని రాబోయే 2, 3 నెలల్లో దీన్ని అమలు చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 8 వందల కోట్ల భారం పడుతుందని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బస్సులు, మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణం
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఎక్కడ : ఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : బస్సులు, మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణం
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఎక్కడ : ఢిల్లీ
Published date : 04 Jun 2019 05:28PM