డ్రెస్కోడ్పై తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు
Sakshi Education
ప్రభుత్వ ఉద్యోగులు హుందాగా ఉండే సంప్రదాయ డ్రెస్కోడ్ పాటించాలని తమిళనాడు ప్రభుత్వం జూన్ 1న ఆదేశాలు జారీ చేసింది.

ముఖ్యంగా సచివాలయ మహిళా ఉద్యోగులు ధరించాల్సిన దుస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ జీవో జారీ చేశారు. మహిళా ఉద్యోగులు ఇకపై చీర, సల్వార్ కమీజ్, చుడీదార్లను మాత్రమే ధరించి విధులకు హాజరు కావాలని కోరింది. అలాగే పురుషులు ప్యాంటు, షర్టు ధరించి రావాలని, రంగు రంగుల టీ షర్టులు ధరించరాదని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రెస్కోడ్పై ఆదేశాలు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రెస్కోడ్పై ఆదేశాలు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం
Published date : 03 Jun 2019 05:55PM