Skip to main content

డోపింగ్‌లో పట్టుబడిన గోమతి

భారత మహిళా రన్నర్ గోమతి మరిముత్తు డోపింగ్‌లో పట్టుబడింది.
దోహా ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ సందర్భంగా గోమతికి నిర్వహించిన పరీక్షల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేశారు. ఆమె ‘ఎ’ శాంపిల్‌ను ల్యాబ్‌లో పరీక్షించగా పట్టుబడింది. ఇప్పుడు మళ్లీ ‘బి’ శాంపిల్‌లోనూ పట్టుబడితే గరిష్టంగా ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశాలున్నాయి. తమిళనాడుకు చెందిన గోమతి ఆసియా అథ్లెటిక్స్‌లో భాగంగా 2019, ఏప్రిల్ 22న నిర్వహించిన 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం గెలిచింది.

నిజానికి గోమతి ఫెడరేషన్ కప్‌లోనే దొరికిపోయింది. 2019, మార్చిలో పాటియాలాలో జరిగిన ఈవెంట్ సందర్భంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమె రక్త,మూత్ర నమూనాల్ని పరీక్షించగా నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు రిపోర్టులో వచ్చింది. అయితే ‘నాడా’ ఈ విషయాన్ని సంబంధిత క్రీడా సంఘానికి తెలపడంలో విఫలమైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
డోపింగ్‌లో పట్టుబడిన భారత మహిళా రన్నర్
ఎప్పుడు : మే 21
ఎవరు : గోమతి మరిముత్తు
Published date : 22 May 2019 06:17PM

Photo Stories