Skip to main content

దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు పురస్కారాలు

2018-19 సంవత్సరానికిగాను దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ పురస్కారాలు లభించాయి.
ట్రాఫిక్ ట్రాన్స్ పోర్టేషన్, పర్సనల్ మేనేజ్‌మెంట్, సివిల్ ఇంజనీరింగ్, స్టోర్స్ విభాగాల్లో ఈ పురస్కారాలు దక్కాయి. ముంబైలోజూలై 7న జరగనున్న 64వ రైల్వే వారోత్సవాల్లో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎంగా ప్రస్తుతం గజానన్ మాల్యా ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2018-19 సంవత్సరానికిగాను దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ పురస్కారాలు
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : ట్రాఫిక్ ట్రాన్స్ పోర్టేషన్, పర్సనల్ మేనేజ్‌మెంట్, సివిల్ ఇంజనీరింగ్, స్టోర్స్ విభాగాల్లో
Published date : 29 Jun 2019 06:11PM

Photo Stories