డీఎస్ఏ ఏర్పాటుకు కేబినెట్ కమిటీ నిర్ణయం
Sakshi Education
అంతరిక్షంలో యుద్ధాలు సాగించేందుకు అనువైన వ్యవస్థల రూపకల్పన కోసం అంతరిక్ష రక్షణ సంస్థ(డీఎస్ఏ)ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జూన్ 11న సమావేశమైన రక్షణపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) నిర్ణయించింది.

డీఎస్ఏకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి వ్యవస్థలను సమకూర్చేందుకు రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఎస్ఆర్వో)ను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. డీఎస్ఏలో ఎంపిక చేసిన శాస్త్రవేత్తల బృందంతోపాటు త్రివిధ దళాలకు చెందిన అధికారులు కూడా ఉంటారు. బెంగళూరు కేంద్రంగా ఎయిర్ వైస్ మార్షల్ అధికారి నేతృత్వంలో ఇది పనిచేస్తుంది.
ఇటీవల భారత్ అంతరిక్షంలోని కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని క్షిపణిని ప్రయోగించి తుత్తునియలు చేసిన విషయం తెలిసిందే. ఈ సత్తాను సంపాదించుకున్న నాలుగో దేశంగా అగ్రరాజ్యాల సరసన నిలిచింది. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తామంటూ ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం డీఎస్ఆర్వో ఏర్పాటుకు నిర్ణయించడం గమనార్హం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతరిక్ష రక్షణ సంస్థ(డీఎస్ఏ) ఏర్పాటుకు నిర్ణయం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : రక్షణపై కేబినెట్ కమిటీ (సీసీఎస్)
ఇటీవల భారత్ అంతరిక్షంలోని కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని క్షిపణిని ప్రయోగించి తుత్తునియలు చేసిన విషయం తెలిసిందే. ఈ సత్తాను సంపాదించుకున్న నాలుగో దేశంగా అగ్రరాజ్యాల సరసన నిలిచింది. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తామంటూ ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం డీఎస్ఆర్వో ఏర్పాటుకు నిర్ణయించడం గమనార్హం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతరిక్ష రక్షణ సంస్థ(డీఎస్ఏ) ఏర్పాటుకు నిర్ణయం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : రక్షణపై కేబినెట్ కమిటీ (సీసీఎస్)
Published date : 12 Jun 2019 06:19PM