Skip to main content

దేశమంతా ఎన్నార్సీ అమలు : అమిత్ షా

జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని దేశమంతా అమలుచేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వెళ్లగొడతామన్నారు.
జార్ఖండ్‌లోని రాంచీలో సెప్టెంబర్ 18న జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేశారు. అస్సాంలో ఇటీవల విడుదల చేసిన ఎన్నార్సీలో 19 లక్షల మందిని విదేశీయులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని దేశమంతా అమలుచేస్తాం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఎక్కడ : రాంచీ, జార్ఖండ్
Published date : 19 Sep 2019 05:29PM

Photo Stories