Current Affairs Today's Headlines Live Updates: మే 10వ తేదీ కరెంట్ అఫైర్స్ లైవ్ అప్డేట్స్ ఇవే..

వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వాటి చివరిలో ఉన్న లింక్పై క్లిక్ చేయండి.
➤ భారత్–పాక్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం
భారత్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్(22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో మే 9వ తేదీ దాయాది బుల్లెట్కు బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ తుర్కియే సోంగర్ డ్రోన్లు.. ఈ డ్రోన్ల ప్రత్యేకతలివే..
భారత త్రివిధ దళాల ముప్పేట దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్.. కొత్త కుయుక్తులతో యుద్ధానికి దిగుతోంది. సంప్రదాయ ఆయుధాలకు బదులుగా అత్యాధునిక డ్రోన్లతో భారత్పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వీటిలో పాక్ మిత్రదేశం తుర్కియే తయారుచేసిన అత్యంత ప్రమాదకరమైన అసిస్గార్డ్ సోంగర్ సాయుధ యూఏవీలు ఉండటం కాస్త కలవరపెడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో సెలవులు నిలిపివేత
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో యుద్ధం జరిగే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ట్రామా సేవలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ దేశంలో 32 విమానాశ్రయాలు మూసివేత
భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం వేళ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) కీలక ప్రకటన చేసింది. తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలోని 32 విమానాశ్రయాలలో అన్ని రకాల పౌర విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విమానాశ్రయాల వివరాలను వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ మాస్కోలో అట్టహాసంగా రష్యా విక్టరీ డే
నాజీ జర్మనీపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ రష్యా మే 9వ తేదీ 80వ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకుంది. మాస్కోలోని రెడ్ స్క్వేర్లో జరిగిన భారీ పరేడ్లో అధ్యక్షుడు పుతిన్తోపాటు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ రెచ్చగొట్టేలా 400 డ్రోన్లతో పాకిస్థాన్ దాడి.. తిప్పికొట్టిన భారత్
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ భారత్పై భారీ దాడికి ప్రయత్నించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 400 డ్రోన్లతో సియాచిన్(లద్దాక్) నుంచి కచ్(GJ) వరకు 36 ప్రాంతాల టార్గెట్గా వీటిని లాంచ్ చేశారని తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ భారత్లో స్టార్లింక్ శాటిలైట్ సేవలకు అనుమతి
ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ కంపెనీ స్టార్ లింక్ భారత్లో సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. తాజాగా టెలికాం శాఖ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) అందుకోవడం ద్వారా, దేశంలో తమ సేవలు ప్రారంభించేందుకు నైజంగా మార్గం వీలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Current Affairs today
- telugu news headlines
- Daily Current Affairs Updates
- current affairs live updates
- telugu current affairs live
- breaking news in telugu
- today’s top news in telugu
- important current affairs 2025
- daily gk updates telugu
- competitive exams current affairs
- Latest Current Affairs 2025
- AP TS news updates
- Current affairs for exams
- Trending news in telugu
- Today Current Affairs Live Updates
- latest current affairs in telugu
- Latest News in Telugu
- Current Affairs Headlines Live Updates
- Sakshi Education News
- Latest Current Affairs