Current Affairs Today's Headlines Live Updates: మే 2వ తేదీ కరెంట్ అఫైర్స్ లైవ్ అప్డేట్స్ ఇవే..

వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వాటి చివరిలో ఉన్న లింక్పై క్లిక్ చేయండి.
➤ నేడు ప్రధాని మోదీ ఏపీలో చేయనున్న శంకుస్థాపనలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన రాజధాని నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభిస్తారు. మోదీ ఈరోజు ఏపీలో రూ.43,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం
పహల్గామ్ ఊచకోత పట్ల భారత ప్రభుత్వం ఎంతో పరిపక్వత ప్రదర్శించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్నారు. తక్షణం కశ్మీర్ వెళ్లి పరిస్థితి ఏమిటో స్వయంగా తెలుసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ మే నెలలో జరుపుకునే ముఖ్యమైన దినోత్సవాలు ఇవే..
2025 మే నెలలో జరుపుకునే ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ, జయంతి, వర్ధంతి దినోత్సవాలను ఇక్కడ తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ ఉక్రెయిన్–అమెరికా మధ్య కుదిరిన ఖనిజ ఒప్పందం
ఈ మేరకు ఉక్రెయిన్–అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంపై స్థానిక కాలమానం ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ సంతకాలు జరిగాయి. అమెరికా తరఫున ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బీసెంట్, ఉక్రెయిన్ తరఫున ఆర్థిక మంత్రి యూలియా సిర్దెంకో ఈ ఒప్పందానికి సంతకాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ భారత్ వీడే పాక్ పౌరులకు మరింత గడువు
భారత్లో ఉంటున్న పాక్ పౌరులకు కొంచెం ఉపశమనం కలిగింది. దేశం వీడేందుకు ఇచ్చిన గడువును కేంద్రం మే 1వ తేదీ సడలించింది. ఏప్రిల్ 30న సరిహద్దును మూసివేస్తామని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ పహల్గాం ఉగ్రదాడి కేసు.. ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు
జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఆర్మీ, లష్కరే తోయిబా కన్నుసన్నల్లో జరిగినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నిర్ధారించింది. పహల్గాం ఉగ్రదాడిలో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ చివరకు కులగణన వైపే మొగ్గు
కులగణన ప్రతిపాదనపై గత కొన్నేళ్లుగా కారాలూ మిరియాలూ నూరుతూ వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు తన వైఖరి మార్చుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
➤ అమెరికా ఎన్ఎస్ఏ వాల్జ్ను పదవి నుంచి తొలగించిన ట్రంప్
జాతీయ భద్రతా సలహాదారు(NSA)గా పనిచేస్తున్న మైక్ వాల్జ్ను ట్రంప్ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో తాత్కాలికంగా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియోను నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Current Affairs today
- telugu news headlines
- Daily Current Affairs Updates
- current affairs live updates
- telugu current affairs live
- breaking news in telugu
- today’s top news in telugu
- important current affairs 2025
- daily gk updates telugu
- competitive exams current affairs
- Latest Current Affairs 2025
- AP TS news updates
- Current affairs for exams
- Trending news in telugu
- Today Current Affairs Live Updates
- latest current affairs in telugu
- Latest News in Telugu
- Current Affairs Headlines Live Updates
- Sakshi Education News