Skip to main content

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర మే 7న ప్రారంభమైంది. చార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు.
ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్-నవంబర్ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్- మే నెలల్లో తిరిగి తెరుస్తారు. మే 7న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవగా మే 9న కేదార్‌నాథ్ ఆలయాన్ని, మే 10న బద్రీనాథ్ ఆలయాన్ని 10న తెరవనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
ఎప్పుడు : మే 7
ఎక్కడ : ఉత్తరాఖండ్
ఎందుకు : యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాల సందర్శనకోసం
Published date : 08 May 2019 05:48PM

Photo Stories