భారత్కు అమెరికా 3.6 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం

తొలి విడత నిధులను కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగిస్తారు. ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్(ఐపీసీ) కేంద్రాలను అభివృద్ధిపరచడం కోసం, కోవిడ్ కేసులను గుర్తించేందుకు, ఆసుపత్రి నెట్వర్క్ని మెరుగుపరిచేందుకు, పర్యవేక్షణ, నిఘా వ్యవస్థల ద్వారా స్థానిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ నిధులను ఉపయోగిస్తారు.
చైనాపై అమెరికా ఆంక్షల బిల్లు
కోవిడ్ విచారణకు సంబంధించి చైనాపై ఆంక్షలకు అమెరికా సంసిద్ధమౌతోంది. చైనాలో ప్రబలిన కరోనా మహమ్మారికి సంబంధించిన అన్ని వివరాలను ప్రపంచానికి తెలపాలనీ, లేని పక్షంలో చైనాపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్కి అధికారాన్నిచ్చే బిల్లుని అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. సెనేటర్ లిండ్ సే గ్రాహం సహా ఎనిమిది మంది సెనేటర్లు రూపొందించిన బిల్లును కాంగ్రెస్ ఎగువసభలో ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్కు 3.6 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం
ఎప్పుడు : మే 13
ఎవరు : అమెరికా
ఎందుకు : కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి