Skip to main content

భారత్-ఫ్రాన్స్ నౌకా విన్యాసాలు ప్రారంభం

గోవా సమీపలోని సముద్రంలో భారత్-ఫ్రాన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నౌకా విన్యాసాలు మే 10న ప్రారంభమయ్యాయి.
వరుణ-2019తో నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు ఫ్రాన్స్ కు చెందిన విమాన వాహక నౌక చార్లెస్ డీ గాల్లె కేంద్రంగా సాగుతున్నాయి. ఈ విన్యాసాల్లో ఇరు దేశాల నుంచి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కలిపి 12 (ఒక్కో దేశం నుంచి ఆరు) పాల్గొంటున్నాయి. చైనాను హెచ్చరించేలా ఈ విన్యాసాలు ఉన్నాయని భావిస్తుండగా, అలాంటిదేమీ లేదని ఫ్రాన్స్ కొట్టిపారేసింది. దక్షిణ చైనా సముద్రంలోని ఇతర దేశాల భాగాలను తమవిగా చైనా చెప్పుకోవడం ఉద్రిక్తతలకు దారితీయడం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్-ఫ్రాన్స్ నౌకా విన్యాసాలు ప్రారంభం
ఎప్పుడు : మే 11
ఎక్కడ : గోవా సముద్రతీరం
Published date : 11 May 2019 05:20PM

Photo Stories