భారత్ కంటే చైనా రక్షణ బడ్జెట్ 3 రెట్లు అధికం
Sakshi Education
బీజింగ్: ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రక్షణ రంగానికి అత్యధికంగా నిధుల్ని కేటాయించే చైనా ఈ ఏడాది మరింతగా బడ్జెట్ను పెంచింది.
గత ఏడాది 177 బిలియన్ డాలర్లుగా ఉన్న బడ్జెట్ను 6.6 శాతం పెంచుతూ ఈసారి 179 బిలియన్ డాలర్లను కేటాయించింది. భారత్తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. కోవిడ్-19 ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై కూడా పడింది. కాగా, సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పోరుబాట పట్టిన హాంకాంగ్పై మరింత పట్టుబిగిస్తూ జాతీయ భద్రతా ముసాయిదా బిల్లును చైనా ప్రభుత్వం మే 22న పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

Published date : 23 May 2020 05:41PM