Skip to main content

భారత్, చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్

భారత్, చైనా సరిహద్దు వివాదంలోకి అనూహ్యంగా అమెరికా వచ్చి చేరింది.
Current Affairs
లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో భారత్- చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 27న ప్రకటించారు. కశ్మీర్ అంశంలోనూ భారత్, పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ గతంలో ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కశ్మీర్ విషయంలో మూడో జోక్యాన్ని అంగీకరించబోమని భారత్ తేల్చిచెప్పింది.

ప్రశాంతంగానే పరిస్థితి
భారత్‌తో సరిహద్దు వివాదం విషయంలో చైనా మే 27న కొంత సంయమన ధోరణిలో స్పందించింది. భారత్‌తో సరిహద్దుల వెంబడి పరిస్థితి ప్రశాంతంగానే ఉందని వ్యాఖ్యానించింది. ‘భారత్ సరిహద్దుల్లో మొత్తానికి పరిస్థితి స్థిరంగా, నియంత్రణలోనే ఉంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అవసరమైన దౌత్య, సమాచార వ్యవస్థ ఇరుదేశాల మధ్య ఉంది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియన్ వ్యాఖ్యానించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: భారత్, చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తా
ఎప్పుడు: మే 27
ఎవరు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు: లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో భారత్- చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో
Published date : 28 May 2020 05:35PM

Photo Stories