Skip to main content

బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించిన ఫొని

భారత్‌లోని ఒడిశా రాష్ట్రాన్ని వణికించిన పెను తుపాన్ ‘ఫొని’ మే 4న బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించింది.
తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా నదులు పొంగి 36 గ్రామాలు నీటమునిగాయి. తుపాను కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా, 63 మంది గాయపడ్డారు. 16 లక్షల మంది ప్రజలను బంగ్లా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. బలమైన ఈదురు గాలులకు 8 తీరప్రాంత జిల్లాల్లో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఒడిశాలో ‘ఫొని’ పెను తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 16కు చేరుకుంది.
Published date : 06 May 2019 04:56PM

Photo Stories