Skip to main content

బల్క్‌ డ్రగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఏర్పాటు

తూర్పు గోదావరి జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairs
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లలో ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏపీఐఐసీకి అనుబంధంగా ఏపీ బల్క్‌ డ్రగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆగస్టు 19న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ బల్క్‌ డ్రగ్‌ పార్కు ద్వారా వచ్చే 8 ఏళ్లలో రూ.6,960 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.46,400 కోట్ల అమ్మకాలు జరుగుతాయని ప్రభుత్వం అంచాన వేస్తోంది. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు...
  • వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే ఈ క్లస్టర్‌ ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ క్టస్టర్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.730 కోట్లు ఖర్చు చేస్తుంది.
  • శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు కోసం రైట్స్‌ కంపెనీ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను మంత్రివర్గం ఆమోదించింది. ఈ పోర్టు మొదటి దశ కింద దాదాపు రూ.3,669.95 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ దశలో భాగంగా 2024–25నాటికి 12.18 ఎంటీపీఏకార్గోనుహ్యాండ్లింగ్, 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏకార్గోహ్యాండ్లింగ్‌ చేయాలన్నది లక్ష్యం.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ బల్క్‌ డ్రగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు :ద్వారా వచ్చే 8 ఏళ్లలో రూ.6,960 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.46,400 కోట్ల అమ్మకాలు జరుగుతాయని
Published date : 21 Aug 2020 12:47PM

Photo Stories