బీఏసీ ఉపాధ్యక్షుడిగా హిమంత
Sakshi Education
భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్) అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ఆసియా బ్యాడ్మింటన్ కౌన్సిల్(బీఏసీ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

మొత్తం 40 ఓట్లకు గాను 35 సంపాదించిన ఆయన వైస్ ప్రెసిడెంట్గా గెలుపొందారు. అసోం రాష్ట్ర విద్య, ఆరోగ్య శాఖ మంత్రి హిమంత 2018 ఏడాది గోవాలో జరిగిన సమావేశంలో బాయ్ అధ్యక్షుడిగా ఎన్నికైన హిమంత దేశంలో బ్యాడింటన్ అభివృద్ధికి తన వంతు కృషి చేశాడు. కాగా, మరో ఇద్దరు భారతీయులు ఒమర్ రషీద్, సుధాకర్ వేమూరి సైతం ఆసియా బ్యాడ్మింటన్ కౌన్సిల్లో చోటు దక్కించుకున్నారు. బాయ్ కార్యదర్శి (టోర్నమెంట్స్) అయిన ఒమర్ రషీద్ ఆసియా బ్యాడ్మింటన్ అభివృద్ధి కమిటీకి, టెక్నికల్ కమిటీకి సుధాకర్ ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా బ్యాడ్మింటన్ కౌన్సిల్(బీఏసీ) ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : మే 26
ఎవరు : హిమంత బిశ్వ శర్మ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా బ్యాడ్మింటన్ కౌన్సిల్(బీఏసీ) ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : మే 26
ఎవరు : హిమంత బిశ్వ శర్మ
Published date : 27 May 2019 05:57PM