Skip to main content

అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వ గడువు పెంపు

అయోధ్యలో రామమందిరం భూ వివాదం కేసుకు సంబంధించి మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు ఆగస్టు 15 వరకు గడువు పొడిగించింది.
ఈ కేసులో సామరస్య పరిష్కారానికి తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరగా దీనికి కోర్టు అంగీకరించింది. ఏళ్లుగా అయోధ్య కేసు పెండింగ్‌లోనే ఉందని, సామరస్య పరిష్కారానికి మరింత సమయం ఇస్తే తప్పేముందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది.

అయోధ్య కేసులో సామరస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ముగ్గురు వ్యక్తులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ దాదాపు 8 వారాల పాటు విచారణ చేపట్టిన అనంతరం మే 7న తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. ఈ కమిటీ చైర్మన్‌గా జస్టిస్ కలీఫుల్లా ఉండగా సభ్యులుగా శ్రీశ్రీ రవిశంకర్, న్యాయవాది శీరాం పంచూ ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వ గడువు పెంపు
ఎప్పుడు : మే 11
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరినందుకు
Published date : 11 May 2019 05:25PM

Photo Stories