అత్యధికంగా భారత్లోనే నిరాశ్రయులు: యూనిసెఫ్
Sakshi Education
2019 ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్లో సుమారు 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి బాలల నిధి(యూనిసెఫ్) వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధికంగా భారత్లోనే నిరాశ్రయులు
ఎప్పుడు : మే 5
ఎవరు : యూనిసెఫ్

ఈ మేరకు ‘లాస్ట్ ఎట్ హోమ్’ పేరుతో మే 5న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2019లో భారత్ తర్వాత ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, చైనా దేశాల్లో అత్యధికంగా నిరాశ్రయులయ్యారు. 2019లో 50,37,000 మంది భారతీయులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. వీరిలో వీరిలో 50,18,000 మంది ప్రకృతి వైపరీత్యాల కారణంగా, 19 వేల మంది ఘర్షణలు, హింస కారణంగా నిరాశ్రయులయ్యారని యూనిసెఫ్ వివరించింది. మరోవైపు 2019లో ప్రపంచ వ్యాప్తంగా 3.30 కోట్ల మంది నిరాశ్రయులుగా మారారు. వీరిలో 1.2 కోట్ల మంది చిన్నారులే ఉన్నారు.
2019లో నిరాశ్రయులైన వారు
2019లో నిరాశ్రయులైన వారు
దేశం | నిరాశ్రయుల సంఖ్య |
భారత్ | 50,37,000 |
ఫిలిప్పీన్స్ | 42,70,000 |
బంగ్లాదేశ్ | 40,80,000 |
చైనా | 40,03,000 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధికంగా భారత్లోనే నిరాశ్రయులు
ఎప్పుడు : మే 5
ఎవరు : యూనిసెఫ్
Published date : 06 May 2020 08:54PM